*విజయవాడ* _*ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ మీడియా సమావేశం వివరాలు..*_ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి అని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు* ★ విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో విద్యాశాఖమంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. ★ పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ★ విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలి అని డిమాండ్ చేశారు. ★ 15 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుందన్నారు. ★ గతంలో కోర్టులతో మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా విద్యార్థుల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము లేదు. ★ విద్యా వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేని విద్యాశాఖ మంత్రి ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరం. ★ కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించాలని అన్నారు. ★ కరోనా విషయంలో ప్రభుత్వ గణాంకాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ★ విద్యార్థులకు మూడో వేవ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలో తగిన ఏర్పాట్లు లేకపోవడం వలన విద్యార్థులకు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ అని అన్నారు. ★ విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుకోవడం చాలా అన్యాయం. ★ పాఠశాలలు యధావిధిగా ప్రారంభించి విద్యార్థులలో కరోనా వ్యాప్తికి కారణం అయితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. ★ ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడ్డా దాని బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటాడా అని ప్రశ్నించారు? ★ విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి దొరకటం కడు శోచనీయమని అన్నారు. ★ పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఏపీ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.